గోల్నాక, ఆగస్టు 26 : జీహెచ్ఎంసీ పరిధిలో అందరికి టీకాలే లక్ష్యంగా ఏర్పాటు చేసిన స్పెషల్ కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ను వేగవంతం చేశామని గ్రేటర్ మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న అంబర్పేట డివిజన్ అనంతరాంరెడ్డి కాలనీలో ఆమె గురువారం కార్పొరేటర్లు ఇ.విజయ్కుమార్గౌడ్, బి.పద్మావతివెంకట్రెడ్డి, మాజీ కార్పొరేటర్ కె.పద్మావతి, డీపీరెడ్డి తదితరులతో కలసి పర్యటించారు.
టీకాలు తీసుకున్న పలువురికి సర్టిఫికెట్లు అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..అర్హులైన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకొని వంద శాతం లక్ష్యాన్ని చేరుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ, జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బందితో పాటు స్థానిక టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.