బంజారాహిల్స్, ఫిబ్రవరి 4: జూబ్లీహిల్స్ నియోజక వర్గంలో పెండింగ్ అభివృద్ధి పనులు, కొత్తగా చేపట్టాల్సిన పనులకు సంబంధించాల్సిన అంచనాలను త్వరగా రూపొందించాలని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులను ఆదేశించారు. శుక్రవారం జూబ్లీహిల్స్లోని తన క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గంలోని అన్ని డివిజన్లకు చెందిన ముఖ్య నాయకులు, జీహెచ్ఎంసీ అధికారులు, కార్పొరేటర్లు, జలమండలి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏయే ప్రాంతాల్లో కొత్తగా పనులు చేపట్టాల్సి ఉంది, ఇప్పటికే ప్రారంభమైన పనులకు సంబంధించి పురోగతి ఎలా ఉందనే విషయాన్ని అధికారులతో అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజక వర్గంలో అభివృద్ధి పనుల కోసం నిధులు సిద్ధంగా ఉన్నాయని ఇప్పటికే కోట్లాది రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఒకటి, రెండు రోజుల్లో మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో వివిధ శాఖలతో నియోజక వర్గ అభివృద్ధి మీద సమీక్ష నిర్వహించనున్నారని తెలిపారు. అన్ని డివిజన్లకు సంబంధించిన పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలోజీహెచ్ఎంసీ సర్కిల్-19 డీఎంసీ రమేశ్, ఈఈ రాజ్కుమార్, ఖైరతాబాద్ తహసీల్దార్ అన్వర్, బాలానగర్ తహసీల్దార్ కృష్ణ, కార్పొరేటర్లు సీఎన్ రెడ్డి, దేదీప్య, రాజ్కుమార్ పటేల్, సంగీతా యాదవ్తోపాటు వివిధ డివిజన్ల అధ్యక్షులు కోనేరు అజయ్కుమార్, అప్పుఖాన్, సంజీవ్, ప్రదీప్, సంతోష్, మన్సూర్ తదితరులు పాల్గొన్నారు.