హైదరాబాద్ : శేరిలింగంపల్లి పరిధిలోని చందానగర్లో ఓ యువతి అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. ఓ యువతితో కలిసి ఒంగోలుకు చెందిన కోటిరెడ్డి చందానగర్లోని లాడ్జిలో దిగాడు. ఇవాళ ఉదయం తలుపులు తెరవకపోవడంతో.. లాడ్జి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు వచ్చి గది తలుపులు తెరిచి చూడగా యువతి చనిపోయి ఉంది. కోటి రెడ్డి గాయాలతో ఉన్నాడు. ఈ ఘటనపై కోటిరెడ్డిని పోలీసులు ప్రశ్నించగా.. పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో ఆత్మహత్యాయత్నం చేసినట్లు చెబుతున్నాడు. హత్యా? ఆత్మహత్యా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.