హైదరాబాద్ : కాలభైరవ పూజతో మెడికల్ ఎగ్జామ్ పాస్ చేయిస్తానని ఓ యువతిని నకిలీ బాబా మోసం చేసిన ఘటన సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో వెలుగు చూసింది. విశ్వజిత్ జా అనే నకిలీ బాబా.. ఫేస్బుక్ ద్వారా ఓ ఎంబీబీఎస్ స్టూడెంట్ను పరిచయం చేసుకున్నాడు. కాలభైరవ పూజతో ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ను పాస్ చేయిస్తానని ఆ యువతికి చెప్పడంతో ఆమె నమ్మింది.
దీంతో విడతల వారీగా రూ. 80 వేల నగదును విశ్వజిత్ బ్యాంకు ఖాతాలో జమ చేసింది. ఆ తర్వాత అతని ఫోన్ స్విచ్ఛాఫ్ చేయడంతో.. మోసపోయానని గ్రహించిన బాధితురాలు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.