హైదరాబాద్ : నగరంలోని పాతబస్తీలో దారుణం జరిగింది. చాంద్రాయణగుట్ట పరిధిలోని హసీమాబాద్లో నడిరోడ్డుపైనే ఓ వ్యక్తిని కత్తులతో పొడిచి చంపారు. కారులో వెళ్తున్న వ్యక్తిని వెంబడించి, ఆ వాహనాన్ని ఆపారు.
ఆ తర్వాత అతన్ని కారులో నుంచి లాగి.. అందరూ చూస్తుండగానే కత్తులతో పొడిచి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడిని మొఘల్పురాకు చెందిన హామీద్గా పోలీసులు గుర్తించారు.