హైదరాబాద్: జీహెచ్ఎంసీలో కరోనా వ్యాక్సినేషన్ ముమ్మరంగా కొనసాగుతున్నది. ఇందులో భాగంగా నేటి నుంచి 30 ఏండ్లు పైబడివారికి టీకాలు పంపిణీ చేస్తున్నారు. దీనికోసం నగరంలోని పీహెచ్సీలు, ప్రత్యేక శిబిరాల్లో కరోనా వ్యాక్సినేషన్ ఇస్తున్నారు. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రమే టీకాలు పంపిణీ చేస్తున్నారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్, వాక్ఇన్లో వ్యాక్సినేషన్ కొనసాగుతున్నది. నగరంలో ఇప్పటివరకు 94 లక్షల డోసులు వేసినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇందులో 78 లక్షల మందికి మొదటి డోసు పంపిణీ చేశామని, మరో 16 లక్షల మందికి రెండు డోసులు పూర్తయ్యాయని తెలిపింది.
గత నెల 28 నుంచి మూడు రోజులపాటు సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సిన్ పంపిణీ చేశారు. నిత్యం ప్రజలతో సంబంధాలు కలిగి, వారి అవసరాల తీర్చే దుకాణదారులు, తోపుడు బండ్ల వ్యాపారులు, ఆటో, క్యాబ్ డ్రైవర్లు, డెలివరీ బాయ్స్, జర్నలిస్టులు తదితరులకు వ్యాక్సిన్ పంపిణీచేసిన విషయం తెలిసిందే.