హైదరాబాద్ : సంగీతం మనసుకు హాయినిస్తుంది. అలా ప్రశాంత వాతావరణంలో మధురమైన బాణిలు వింటుంటే మనసు గాలిలో తేలిపోతోంది. అలా హైదరాబాదీలను పలు ఎఫ్ఎంలు వినసొంపైన సంగీతాన్ని అందించి అలరిస్తున్నాయి. 93.5 RED FM సరికొత్త మ్యూజికల్ ఎక్స్పీరియన్స్ను ఇప్పుడు మీ ముందుకు తేబోతోంది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలను అలరించేందుకు హుక్ అయిపోదాం ( HOOK AIPODAM ) అనే కొత్త ప్రోగ్రామ్ను పరిచయం చేయనుంది. రెండు రాష్ట్రాల కల్చర్ను ఈ ప్రోగ్రామ్ ద్వారా తెలుపనుంది. శ్రోతలను వంద శాతం అలరించడమే లక్ష్యంగా హుక్ అయిపోదాం ప్రోగ్రామ్ను ప్లాన్ చేశారు. శ్రోతలను అలరించేందుకు ప్రముఖ సినీ గాయకులు హేమచంద్ర, సాహితీ చాగంటితో హుక్ అయిపోదాం జింగిల్ను రూపొందించారు.
ఈ సందర్భంగా రెడ్ ఎఫ్ఎం డైరెక్టర్ బీ సురేందర్ మాట్లాడుతూ.. మా శ్రోతలను మెప్పించే విధంగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు. కరోనా మహమ్మారి ప్రతి ఒక్కరిపై ప్రభావం చూపుతోంది. ప్రతి ఒక్కరూ ఉల్లాసంగా గడపాలనే ఉద్దేశంతో హుక్ అయిపోదాం అనే ట్యూన్ను ప్రారంభించబోతున్నాం. ఈ సరికొత్త ట్యూన్ రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలను మెప్పిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
హుక్ అయిపోదాం ప్రచారానికి సినీ ప్రముఖులు నాగార్జున, సూర్య, నాని, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీతిసింగ్, రవితేజ, లావణ్య త్రిపాఠి, అడవి శేషు, మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్ నుంచి అపూర్వమైన స్పందన లభించిందని డైరెక్టర్ సురేందర్ పేర్కొన్నారు.