హైదరాబాద్ : కరోనా కట్టడికి ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్డౌన్ను పోలీసులు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయడంతోపాటు వాహనాలను సీజ్ చేస్తున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇవాళ 5,528 మందిపై కేసులు నమోదు చేశారు. 4829 వాహనాలను జప్తు చేశారు. అదేవిధంగా మాస్కులు ధరించని/ పాక్షికంగా ధరించిన 1412 మందిపై కేసులు పెట్టారు. భౌతికదూరం పాటించని 294 మందిపై, గుంపులుగా తిరుగుతున్న 77 మందిపై, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, గుట్కా, పాన్ మసాలా తీసుకుంటున్న 49 మందిపై కేసులు నమోదు చేసినట్లు కమిషరేట్ కార్యాలయం అధికారులు వెల్లడించారు. మొత్తంగా 7,360 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.