న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎంవై ఇక్బాల్ ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ ఉదయం ఢిల్లీలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1951, ఫిబ్రవరి 13న బీహార్లో జన్మించిన ఎంవై ఇక్బాల్.. 1970లో రాంచి యూనివర్సిటీ నుంచి బీఎస్సీ పూర్తిచేశారు. 1974లో ఎల్ఎల్బీ డిస్టింక్షన్లో పాసై గోల్డ్ మెడల్ సాధించారు. 1975 నుంచి ఆయన న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు.
1990లో పట్నా హైకోర్టు రాంచి బెంచ్కు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమితులయ్యారు. ఆ తర్వాత 1996లో పట్నా హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా, 2000 సంవత్సం నుంచి జార్ఖండ్ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్గా జస్టిస్ ఇక్బాల్ నియమితులయ్యారు. అనంతరం 2012, డిసెంబర్ 24 నుంచి 2016, ఫిబ్రవరి 12 వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి రిటైర్డ్ అయ్యారు.