హైదరాబాద్ : బ్లాక్ ఫంగస్కు ఉపయోగించే మెడిసిన్స్ను బ్లాక్లో విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నకిలీ మందులు కూడా ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. సుమారు రూ. 18 లక్షల విలువ చేసే మెడిసిన్స్ను పోలీసులు సీజ్ చేశారు. నిందితులకు సహకరించిన ఎర్రగడ్డ ఈఎస్ఐ డాక్టర్ పరారీలో ఉన్నారు. ఆ డాక్టర్ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.