హైదరాబాద్ : సికింద్రాబాద్లో బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్లు విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. రాంగోపాల్పేట్లో అధిక ధరకు ఇంజెక్షన్లను అమ్ముతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి 35 అంఫోటెరిసిన్ -బీ ఇంజెక్షన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత కొద్ది రోజుల నుంచి హైదరాబాద్లో బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్లను పలువురు బ్లాక్లో విక్రయిస్తున్న విషయం విదితమే. ఇలాంటి ముఠాలపై పోలీసులు నిఘా పెట్టి.. వారిని అదుపులోకి తీసుకుంటున్నారు.