న్యూఢిల్లీ: దేశీయ ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుతం ఎండీగా ఉన్న గ్యుంటేర్ బుచెక్కు మరో ఏడాది పాటు పొడిగింపు ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తున్నది. సంస్థ ఎండీగా బాధ్యతలు స్వీకరించేందుకు మార్క్ ల్లిస్టోసెల్లా నిరాకరించిన తర్వాత బుచెక్కు ఈ నెలాఖరు వరకు పొడిగించింది.
బుచెక్ నియామకంపై వదంతుల విషయమై స్పందించేందుకు టాటా మోటార్స్ నిరాకరించింది. 2014లో టాటా మోటార్స్ అప్పటి ఎండీ కం సీఈవో కార్ల్ స్ల్యామ్ మరణించిన తర్వాత 2016 వరకు ఆ పదవి ఖాళీగా ఉన్నది.
2016లో ఎయిర్ బస్ మాజీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా ఉన్న బుచెక్కు టాటా మోటార్స్ సీఈవో కం ఎండీగా నియమించుకున్నది. బుచెక్ వ్యక్తిగత కారణాల రీత్యా తన పదవీ కాలం ముగిసిన వెంటనే జర్మనీకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. బుచెక్ స్థానంలో ల్లిస్టోసెల్లాను ఎంపిక చేసింది టాటా మోటార్స్.
కానీ టాటా మోటార్స్ నిర్ణయం పట్ల ల్లిస్టోసెల్లా నిరాకస్తత ప్రకటించారు. దీంతో మార్క్ ల్లిస్టోసెల్లా తమ ఎండీ కం సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం లేదని గత మార్చి 19వ తేదీన టాటా మోటార్స్ అధికారికంగా ప్రకటించింది.