చికిత్సకు సహకరించాలని మంత్రి కేటీఆర్కు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి వినతి
ఆమనగల్లు, జూలై 13 : అరుదైన వ్యాధితో బాధపడుతున్న నెలలు నిండని చిన్నారి వైద్య చికిత్స కోసం ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం అందజేయాలని రాష్ట్ర పురపాలక శాఖ, ఐటీ మినిస్టర్ కేటీఆర్ను ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కోరారు. మంగళవారం ప్రగతిభవన్లో మంత్రి కేటీఆర్ను ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆమనగల్లుకు చెందిన కొండేటి అఖిల, సాయికిరణ్ దంపతులకు 20 రోజుల క్రితం ఆడపిల్ల పుట్టింది. అప్పటి నుంచి చిన్నారి అరుదైన కాలేయ వ్యాధితో బాధపడుతున్నది. దీంతో బాధిత కుటుంబ సభ్యులు పాపకు మెరుగైన వైద్యం అందించేందుకు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. వైద్యులు పరీక్షించి ప్రపంచవ్యాప్తంగా లక్షల్లో ఒకరు ఇలాంటి అరుదైన వ్యాధితో బాధపడుతున్నారని చెప్పారు. ఈ వ్యాధి నుంచి కోలుకోవాలంటే ప్రత్యేక శస్త్రచికిత్సలు చేయాల్సి వస్తుందని.. అందుకు రూ.30లక్షలకు పైగా ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. దీంతో పాప చికిత్స కోసం తమ వద్ద అంతా స్థోమత లేకపోవడంతో బాధితులు ఎమ్మెల్సీ కసిరెడ్డిని ఆశ్రయించి సమస్యను విన్నవించారు. దీనికి స్పందించిన ఆయన ప్రత్యేకంగా మంత్రి కేటీఆర్ను కలిసి సీఎం రిలీఫ్ఫండ్ ద్వారా చిన్నారి చికిత్సకు సహకారం అందించాలని కోరగా.. హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.