హైదరాబాద్ : నగరంలోని జూబ్లీహిల్స్ ప్రాంతానికి మరో ఆకర్షణ జత అయింది. ఇక్కడి ఓ బహిరంగ ప్రదేశాన్ని జీహెచ్ఎంసీ మోనోలిత్ పార్కుగా అభివృద్ధి చేసింది. 1,100 చదరపు గజాల స్థలాన్ని మోనోలిత్ పార్క్గా అభివృద్ది పరిచింది. ఈ పార్క్లోని పెద్దరాయిని జలపాతంగా మలిచింది. హైదరాబాద్లోని చారిత్రక ప్రదేశాలను పెయింటింగ్స్గా చిత్రీకరించారు. కూర్చునేందుకు చెక్కతో తయారు చేసిన కూర్చీలను ఏర్పాటు చేశారు. పచ్చదనం, ఆహ్లాదంతో కూడిన ఆకర్షణీయంగా పార్క్ను తీర్చిదిద్దారు. ఈ పార్క్ను శనివారం నగర మేయర్ జి. విజయ లక్ష్మి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్(ఖైరతాబాద్) పి.ప్రవీణ్య, ఇతర జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు.