అనుచరులను రిక్రూట్ చేస్తున్న చంద్రబాబు
ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు
హుస్నాబాద్, జూలై 9 : తెలంగాణలో టీడీపీని బలోపేతం చేయాలనే కుట్రలో భాగంగానే రేవంత్రెడ్డి కాంగ్రెస్లో చేరి పీసీసీ అధ్యక్షుడు అయ్యడని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు విమర్శించారు. తెలంగాణలో టీడీపీని ప్రజలు నమ్మడంలేదని భావిస్తున్న చంద్రబాబు.. కాంగ్రెస్ ముసుగులో అడుగు పెట్టేందుకు కుట్రలు చేస్తున్నాడని ఆరోపించారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని కల్లెపల్లిలో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మతో కలిసి శుక్రవారం ప్రారంభించారు. అనంతరం హరీశ్రావు మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తుపెట్టుకున్న చంద్రబాబు ఇక్కడ బోణీ కొట్ట్టాలని విఫలయత్నం చేశారని, ఆయనను ఆంధ్రాబాబుగా గుర్తించి తెలంగాణ ప్రజలు తరమికొట్ట్టారని గుర్తుచేశారు. టీడీపీ మొఖంతో వస్తే ప్రజలు రానివ్వరని తన మనుషులను కాంగ్రెస్లోకి పంపి పదవులు ఇప్పిస్తున్నాడని చెప్పారు. 70 ఏండ్లలో తెలంగాణకు ఏమిచేయని కాంగ్రెస్ పార్టీ, పదేండ్లు పాలన చేసి ప్రజలకు ఏమిచేయని టీడీపీలు మనకు అవసరమా అని మంత్రి ప్రశ్నించారు. కాంగ్రెస్, టీడీపీ దొందుదొందేనని అన్నారు.