చండూరు, జూలై 7 : గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. దోనిపాములలో జడ్పీ నిధులు రూ.5 లక్షలతో డ్రైనేజీ నిర్మాణానికి జడ్పీటీసీ కర్నాటి వెంకటేశంతో కలిసి శంకుస్థాపన చేశారు. చండూరులో రూ.15 లక్షలతో ప్రెస్క్లబ్ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. జోగిగూడేనికి చెందిన ఇందుమతికి రూ.12 వేల సీఎం సహాయనిధి చెక్కును అందించారు. సీఎం కేసీఆర్ చేనేత బీమా ప్రకటించినందున హర్షం వ్యక్తం చేస్తూ చేనేత కార్మికులు సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. సన్షైన్ స్కూల్లో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఇల్లు కూలిపోయిన కార్మికుడికి రూ.5 వేల సాయం అందించారు. ఆయా కార్యక్రమాల్లో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బొమ్మెరబోయిన వెంకన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ గుర్రం మాధవి, కౌన్సిలర్ కోడి వెంకన్న, డైరెక్టర్ అశోక్, నాయకులు దశరథ, వెంకన్న, శ్రీనివాసులు, సతీశ్ పాల్గొన్నారు.
ప్రగతి పనులను పరిశీలించిన డీపీఓ..
కట్టంగూర్/ నల్లగొండరూరల్/ శాలిగౌరారం : పల్లెప్రగతిలో భాగంగా కట్టంగూర్, అయిటిపాములలో పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, డంపింగ్యార్డులను జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్థన్రెడ్డి పరిశీలించి మొక్కలు నాటారు. గ్రామాల్లో ప్రతిరోజూ మురుగు కాల్వలను శుభ్రపరచాలని అధికారులకు సూచించారు. ప్రతిఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరారు. మండల ప్రత్యేకాధికారి బాలశౌరి, ఎంపీపీ ముత్తిలింగయ్య, జడ్పీటీసీ బలరాములు, ఎంపీడీఓ సునీత, ఎంపీఓ పర్వేజ్, ఏపీఓ వెంకటేశం, సర్పంచులు చెనగోని సతీశ్, బెజవాడ సరోజనాసైదులు, ఎంపీటీసీలు మహాలక్ష్మి, వీరమ్మ పాల్గొన్నారు. నల్లగొండ మండలంలోని దండంపల్లి గ్రామంలో రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలను పరిశీలించారు. ఎంపీఓ మాధవరెడ్డి, సర్పంచ్ పుష్పాసైదులు, ఉప సర్పంచ్ శ్రవణ్, కార్యదర్శి యాదయ్య పాల్గొన్నారు. శాలిగౌరారం మండలం వల్లాల గ్రామంలో పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించారు. మండల ప్రత్యేకాధికారి తిరుపతయ్య, ఎంపీడీఓ లక్ష్మయ్య, సర్పంచ్ ఇంతియాజ్ పాల్గొన్నారు.
పెండింగ్ పనులను పూర్తిచేయాలి: ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి
నల్లగొండ రూరల్ : నల్లగొండ మండలంలోని మేళ్లదుప్పలపల్లి, తొరగల్, అన్నారెడ్డిగూడెంలో పల్లె ప్రగతి పనులను ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి పరిశీలించారు. ఆయన వెంట ఎంపీపీ సుమన్, ఎంపీడీఓ వై.శ్రీనివాస్రెడ్డి, ఏఆర్ఐ అమర్నాథ్రెడ్డి, మాదగోని అశోక్, ఏపీఓ గోపాల్రెడ్డి, సర్పంచులు సరస్వతి, ఆండాలు, పద్మావతి ఉన్నారు.
విస్తృతంగా పర్యటిస్తున్న ప్రత్యేకాధికారులు
నార్కట్పల్లి/ మునుగోడు : పల్లె ప్రగతిలో భాగంగా మండల ప్రత్యేకాధికారులు విస్తృతంగా పర్యటించి పనులను పరిశీలిస్తున్నారు. నార్కట్పల్లి మండలం చిన్ననారాయణపురంలో ప్రత్యేకాధికారి సుచరిత మొక్కలు నాటి వైకుంఠధామం, డంపింగ్యార్డును పరిశీలించారు. ఎంపీడీఓ సాంబశివరావు, సర్పంచ్ కొత్త నర్సింహ పాల్గొన్నారు. మునుగోడు మండలం వెల్మకన్నె గ్రామంలో ప్రత్యేకాధికారి హుస్సేన్బాబా నర్సరీని పరిశీలించి పలు సూచనలు చేశారు. ఆయన వెంట ఎంపీడీఓ యాకూబ్నాయక్, ఎంపీఓ సుమలత, సర్పంచ్ చలమల్ల వెంకట్రెడ్డి, ఆంజనేయులు, సత్తయ్య ఉన్నారు.
చిట్యాల: పట్టణ ప్రగతిలో భాగంగా చిట్యాల పట్టణం 3వ వార్డులో చైర్మన్ చినవెంకట్రెడ్డితోపాటు మున్సిపల్ సిబ్బంది దగ్గరుండి వీధులన్ని శుభ్రం చేయించారు.
సర్పంచుల ప్రత్యేక శ్రద్ధ..
శాలిగౌరారం/ నాంపల్లి : పల్లె ప్రగతి పనుల్లో సర్పంచులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. శాలిగౌరారంలో సర్పంచ్ హరితావీరబాబు మొక్కలను పంపిణీ చేశారు. ఎంపీటీసీ జోగు సైదమ్మ, ఉప సర్పంచ్ గోదల సురేశ్రెడ్డి పాల్గొన్నారు. నాంపల్లి మండలం తుంగపహాడ్లో సర్పంచ్ దండిగ అలివేలు గ్రామస్తులకు మొక్కలను పంపిణీ చేశారు. మర్రిగూడ మండల కేంద్రంలో సర్పంచ్ నల్ల యాదయ్య ప్రభుత్వ దవాఖానలో 800మొక్కలు నాటేందుకు గుంతలు తీయించారు. ఆర్డబ్ల్యూఎస్ ఏఈ వెంకటేశ్వర్లు, కార్యదర్శి యూసుఫ్ పాల్గొన్నారు.