ఇంటింటా మొక్కలు నాటి సంరక్షించేలా చూడాలి
పల్లె ప్రగతి, హరితహారంలో ప్రజాప్రతినిధులు, అధికారులు
జనగామ, జూలై 6 (నమస్తే తెలంగాణ) : ఇంటింటా మొక్కలు నాటడంతోపాటు వాటిని సంరక్షించి హరిత జనగామగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం పట్టణంలోని 14వ వార్డు లో పట్టణప్రగతిని పరిశీలించి రహదారులు, మురికికాల్వలను శుభ్రం చేసే పనులను స్వయంగా పర్యవేక్షించారు. 8వ వార్డులో విద్యుత్ తీగల కింద హరితహారం మొక్కలు నాటుతుండడాన్ని గమనించిన ముత్తిరెడ్డి వెంటనే మున్సిపల్ కమిషనర్ నర్సింహ, ప్రత్యేక అధికారి కృష్ణవేణి, వార్డు కౌన్సిలర్ సురేశ్రెడ్డిని పిలిపించి రోడ్డు బౌండరీలో నాటించారు. నాలుగో విడుత పట్టణ ప్రగతి, ఏడో విడుత హరితహారంలో రహదారులు, డ్రైనేజీలను శుభ్రంగా చూడాలని కోరారు. కాలనీల్లో మురికి తుమ్మ చెట్లు, శిథిలమైన ఇండ్లను యంత్రాలతో తొలగించాలని సూచించారు. ఇనుప విద్యుత్ స్తంభాలు ఎక్కడెక్కడ ఉన్నాయనేది గమనించి సరి చేయించాలని కోరారు. గతంతో పోలిస్తే ఇప్పుడు పట్టణాలు, గ్రామాలు ఎంతో అభివృద్ధి సాధించాయని పారిశుధ్య నిర్వహణ, హరితహారంలో అందరినీ భాగస్వాములను చేయాలని కోరారు. రాష్ర్టాన్ని బంగారు తెలంగాణ దిశగా తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పానికి అందరూ చేయూతనివ్వాలన్నారు. వార్డుల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటి కాలనీలను హరితవనంగా చేయాలని, ప్రతి ఇంటికీ మొక్కలు ఇవ్వడంతోపాటు వాటిని నాటించి సంరక్షించేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ముత్తిరెడ్డి స్పష్టం చేశారు.
పల్లెప్రగతిలో విద్యుత్ మరమ్మతులు
దేవరుప్పుల : పల్లెప్రగతిలో భాగంగా మండల కేంద్రం లో మంగళవారం విద్యుత్ సమస్యల పరిష్కారానికి సం బంధిత అధికారులు చర్యలు చేపట్టారు. గ్రామానికి విద్యుత్ సరఫరా చేసే నల్ల చెరువు కట్టపై ఉన్న ట్రాన్స్ఫార్మర్ స్తంభం ఓవైపు ఒరిగిపోగా దానిని సరిచేశారు. విద్యుత్తీగలకు తగులుతున్న చెట్ల కొమ్మలను నరికారు. మరోవైపు ట్రాన్స్ఫార్మర్ ఓవర్ ఆయిలింగ్ను చేసి సరి చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఈదునూరి రమాదేవి, విద్యుత్ శాఖ డీఈ మన్సూర్, ఏడీఈ సత్యనారాయణ, ఏఈ సుధాకర్, లైన్మెన్ నర్సయ్య పాల్గొన్నారు.
పల్లెప్రగతి పనులు పూర్తి చేయాలి..
బచ్చన్నపేట : మండలంలోని ఆయా గ్రామాల్లో పెండింగ్లో ఉన్న పల్లెప్రగతి పనులు వెంటనే పూర్తి చేయాలని మండల ప్రత్యేకాధికారి రాజేంద్రప్రసాద్ అన్నారు. మంగళవారం గంగాపూర్లోని నర్సరీని, సెగ్రిగేషన్షెడ్, శ్మశానవాటిక పనులను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలనే ధ్యేయం తో రాష్ట్ర ప్రభుత్వం పల్లెప్రగతి చేపట్టిందన్నారు. హరితహారం సందర్భంగా ప్రతి గ్రామంలో మొ క్కలు నాటాలన్నారు. ఇదిలా ఉండగా ఎంపీడీవో రఘురామకృష్ణ పలు గ్రామాలను సందర్శించి అభివృద్ధి పనులు పర్యవేక్షించారు. దళితవాడల్లో పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం జ్యోతి, పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్, గ్రామ ప్రత్యేకాధికారి నర్సింహులు పాల్గొన్నారు.
మరియపురంలో హరిహారం
తరిగొప్పుల : పల్లెప్రగతిలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు బీరెడ్డి జార్జిరెడ్డి అన్నారు. నాలుగో విడుత పల్లెప్రగతిలో భాగంగా మంగళవారం మండలంలోని మారియపురంలో ఆయనతోపాటు స్థానికులు పిచ్చిమొక్కలను తొలగించి పారిశుధ్య పనులు చేశ్టారు. ఈ సందర్భంగా జార్జిరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
మోడల్ స్కూల్లో హరితహారం
జఫర్గడ్ : మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో హరితహారం కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ శ్రీకాంత్, ఉపాధ్యాయులు పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. శ్రీకాంత్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణతోపాటు మానవ మనుగడకు వృక్షాలు దోహదపడుతాయన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి వాటిని సంరక్షించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జానీ నాయక్, మహేందర్, కిరణ్ కుమార్, గణేశ్, పావని, లక్ష్మి తదిత రులు పాల్గొన్నారు.