సిటీ క్రిమినల్ కోర్ట్, నాంపల్లి, జూన్ 17(నమస్తే తెలంగాణ): హైకోర్టుకు పెంచిన జడ్జీలను సంఖ్యకు అనుగుణంగా వెంటనే కేటాయించాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణను రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు, ప్రభుత్వ న్యాయవాది చలకాని వెంకట్యాదవ్ కోరారు. గురువారం హైదరాబాద్లో సీజేఐ ఎన్వీ రమణను వెంకట్యాదవ్ ప్రత్యేకంగా సన్మానించారు. జడ్జీ భర్తీలో సమన్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తిచేశారు.