నారాయణపేట : అడవుల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ హరిచందన అన్నారు.
జిల్లా కేంద్రం సమీపంలోని ఎక్లాస్పూర్, అర్బన్ లంగ్ స్పేస్, మినాస్ పూర్, రిజర్వు ఫారెస్ట్ అభివృద్ధి పనులపై గురువారం సాయంత్రం కలెక్టరేట్లో నారాయణపేట ఎమ్మెల్యే ఎస్. రాజేందర్ రెడ్డి అటవీశాఖ అధికారులతో కలిసి కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అడవులు అంతరిస్తున్న కారణంగా దట్టమైన అడవిని రూపొందించుటకు వచ్చే ఏడాది అడవుల పునరుత్పత్తి, పునరాభివృద్ధిపై అటవీశాఖ అధికారులు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సూచించారు. సమీక్ష సమావేశంలో మహబూబ్ నగర్ సర్కిల్ సీసీఎఫ్ క్షితిజ, డీఎఫ్ఓ గంగిరెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
పల్లె ప్రగతిలో అందరు భాగస్వాములు కావాలి
జాతీయ రహదారికి ఇరువైపులా మొక్కలు నాటాలి
రాగల మూడు రోజులు రాష్ట్రంలో వర్షాలు
టీఆర్ఎస్ను వీడే ప్రసక్తే లేదు : ఎంపీ బీబీ పాటిల్
అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
సింగరేణి నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలి