న్యూఢిల్లీ : రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 56లక్షలకుపైగా మోతాదులు అందజేయనున్నట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రాలు, యూటీల వద్ద 2,18,28,483 మోతాదులు అందుబాటులో ఉన్నాయని చెప్పింది. ఇప్పటి వరకు 27,28,31,900 మోతాదులను కేంద్రం ఉచితంగా సరఫరా చేసిందని పేర్కొంది. గురువారం ఉదయం 8 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వ్యర్థాలతో సహా 25,10,03,417 మోతాదులు వినియోగించినట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు 26,55,19,251 వ్యాక్సిన్ మోతాదులను అందించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరించింది.