న్యూఢిల్లీ : ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించడం, వైరస్ రూపాంతరం చెందుతున్న తీరుపై నిరంతరం దృష్టిపెట్టడం, సరైన సమయంలో చికిత్సనందించడాన్ని అమలుచేయడమే కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఉత్తమమైన మార్గమని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం ఉపరాష్ట్రపతి నివాసం నుంచి వివిధ రాష్ట్రాల గవర్నర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా పాల్గొన్నారు.
ప్రజల భాగస్వామ్యంతో కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు వీలుందని.. ఇందుకోసం ప్రజల్లో మరింత చైతన్యం తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరగడంపై ఆందోళన వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి, ఈ తీవ్రమైన పరిస్థితుల కారణంగా వైద్య వ్యవస్థపై పెనుభారం పడుతుందన్నారు. గతేడాదితో పోలిస్తే కరోనాను ఎదుర్కొనే విషయంలో భారతదేశం సంసిద్ధంగా ఉందని.. వైద్యవసతులతోపాటు కరోనాకు భద్రమైన, ప్రభావవంతమైన టీకా కూడా అందుబాటులోకి వచ్చిన విషయాన్ని మరవొద్దని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.
కరోనా వైరస్ నేపథ్యంలో అనుసరించాల్సిన జాగ్రత్తలను, ప్రభుత్వాలు సూచిస్తున్న అంశాలను అర్థం చేసుకుని పాటించడం ద్వారా ప్రజలు కరోనాపై పోరాటంలో విజయం సాధించేందుకు పుష్కలమైన అవకాశాలున్నాయని ఆయన అన్నారు. ఈ దిశగా ప్రతి భారతీయుడూ తనవంతు పాత్రను సమర్థవంతంగా పోషించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆరోగ్య, కుటుంబసంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్తోపాటు వివిధ రాష్ట్రాల గవర్నర్లు ఇంటర్నెట్ వేదిక ద్వారా పాల్గొన్నారు.
ఈ నెల 24 న ఇస్తాంబుల్లో టర్కీ శాంతి సమావేశం
భారత్లో బోరిస్ జాన్సన్ పర్యటన కుదింపు
చంద్రుడిపై రోవర్ను పంపేందుకు జపాన్తో జతకట్టిన అరబ్ ఎమిరేట్స్
ఎవర్ గివెన్ను స్వాధీనం చేసుకోండి : ఈజిప్ట్ కోర్టు
జూన్ 1 నుంచి హాల్మార్క్ నగలే అమ్మాలి..
సొంత ప్రజలపైనే కెమికల్ అటాక్.. సిరియా దుర్మార్గాన్ని బయటపెట్టిన నివేదిక
కుట్టుపిండి ఆహారాలు తిన్న 500 మందికి అస్వస్థత
సీబీఐ ఎదుట హాజరైన అనిల్ దేశ్ముఖ్
మహా దార్శనికుడు భీంరావ్ అంబేడ్కర్ : చరిత్రలో ఈరోజు
టీకా వేసుకోండి.. ఎక్కువ వడ్డీ పొందండి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..