అమరావతి : రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారమే పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహిస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు.
కొవిడ్ కేసులు పెరిగితే పరీక్షల నిర్వహణపై సమీక్ష నిర్వహించి అనంతరం నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.
పాఠశాలల్లో విద్యార్థులు కొవిడ్ బారినపడకుండా జాగ్రత్తలు పాటిస్తున్నట్లు తెలిపారు. కొవిడ్ నిబంధనలు పాటించని విద్యాసంస్థలపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి