కాజీపేట, ఏప్రిల్ 6: రాష్ట్ర ప్రభుత్వం రజక కులస్తులకు 250 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందిస్తుండడంతో నగరంలోని రజకులంతా సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామని రజక సంఘం జిల్లా నాయకుడు, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పాలడుగుల శివకుమార్ అన్నారు. మంగళవారం కాజీపేట చౌరస్తాలో సీఎం కేసీఆర్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ ఫ్లెక్సీకి సోమిడి సోమేశ్వర రజక పరపతి సంఘం ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని కులవృత్తులను ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. రజకుల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఉచితంగా విద్యుత్ అందించడం అభినందనీయమన్నారు. భవిష్యత్లో తామంతా టీఆర్ఎస్ వెంటే ఉంటామన్నారు. కార్యక్రమంలో రజక సంఘం నాయకులు పాలడుగుల రామస్వామి, అనిల్, కిషన్, ఉపేందర్, సుధాకర్, సదానందం, శ్రీను, రవి పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి పేదల పక్షపాతి..
సుబేదారి: సీఎం కేసీఆర్ పేదల పక్షపాతి అని కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి అన్నారు. మంగళవారం 51వ డివిజన్ మాజీ కార్పొరేటర్ మిడిదొడ్డి స్వప్న ఆధ్వర్యంలో నాయీ బ్రాహ్మణులతో కలిసి ప్రశాంత్నగర్లో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాని తెలిపారు. రజకులకు ఉచితంగా విద్యుత్ అందిం చి అండగా నిలిచారన్నారు. కార్యక్రమంలో పార్టీ డివిజన్ అధ్యక్షుడు కోటిలింగం, పుల్లయ్య, వెంకటస్వామి, యాదయ్య పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఎల్డీఎఫ్ను అయ్యప్ప దీవిస్తాడు: కేరళ సీఎం
ఈ ఎన్నికల్లో మా కూటమిదే విజయం: పీ చిదంబరం