నిజామాబాద్ : జిల్లాలోని బోధన్ ఎమ్మెల్యే షకీల్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. గురువారం హైదరాబాద్లో ఆయన కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్ వచ్చినట్లు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ వర్గాలు తెలిపాయి.
ఎమ్మెల్యే షకీల్ తండ్రి ఆజాం, తల్లి, సోదరికి పదిరోజుల క్రితం కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం ఎమ్మెల్యే తండ్రి ఆజాం హైదరాబాద్లోని యశోదా దవాఖానలో చికిత్స పొందుతున్నారు. తాజాగా ఎమ్మెల్యే షకీల్కు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది.
మూడు రోజులుగా తనను కలిసిన వారందరు కూడా 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలని ఎమ్మెల్యే షకీల్ ఓ ప్రకటనలో సూచించారు.
ఇవి కూడా చదవండి..
విషాదం : గోదావరిలో స్నానానికి వెళ్లి ఆరుగురి మృతి
మెదక్ చర్చిలో భక్తి శ్రద్ధలతో ‘గుడ్ఫ్రైడే’
నిజామాబాద్ ఘటనపై ఎమ్మెల్సీ కవిత దిగ్భ్రాంతి
బీజేపీ ఎమ్మెల్యే కారులో ఈవీఎంలు.. రీపోలింగ్కు ఈసీ ఆదేశం
వైభవంగా వీరభద్రుడి బ్రహ్మోత్సవాలు
చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడి మృతి