మియాపూర్ , ఏప్రిల్ 1: మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి గడపకు తాగునీరు అందిస్తున్నామని ప్రభుత్వ విప్ , శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నా రు . నియోజకవర్గంలోని హైదర్నగర్ డివిజన్ హెచ్ఎంటీ శాతవాహననగర్, హెచ్ఎంటీ హిల్స్, ఆదిత్యనగర్లలో రూ. 6 .20 కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న తాగునీటి పైప్లైన్ పనులను కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు, జలమండలి జీఎం ప్రభాకర్రావు, డీజీఎం వెంకటేశ్వర్లుతో కలిసి గురువారం శంకుస్థాపన చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన హామీని ప్రభుత్వం వందశాతం పూర్తి చేసి తన మాటను నిలుపుకుంటున్నదని పేర్కొన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గవ్యాప్తంగా కోట్లాది రూపాయలతో 18 రిజర్వాయర్లను నిర్మిం చి అన్ని ప్రాంతాలకు పైప్లైన్లను విస్తరించి ఇంటింటికీ తాగునీటిని సరఫరా చేస్తున్నామన్నారు.
మంత్రి కేటీఆర్ ఇదే కాలనీల్లో ఇచ్చిన మాట మేరకు లీకేజీలు, కలుషిత నీటి సమస్యలకు శాశ్వత పరిష్కారంగా నూతన పైప్లైన్లను నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. వేసవి నేపథ్యంలో ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. పైప్లైన్ పనులు పూర్తయిన వెంటనే కాలనీల్లో పక్కా సీసీ రహదారులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కాలనీల ప్రజల తరఫున మంత్రి కేటీఆర్కు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అందే నర్సింహ, కృష్ణమూర్తి, యాదిరెడ్డి, సదానంద, కోటేశ్వర్రావు, భాస్కర్రెడ్డి, వినయ్బాబు, గాంధీరావు, శ్రీనివాసరాజు, ఉమామహేశ్వర్రావు, దామోదర్రెడ్డి, రంగరాయప్రసాద్,సుబ్బారావు, సైదేశ్వర్,పోతుల రాజేందర్, వెంకటేశ్యాదవ్, కృష్ణ, ఖదీర్, సదా బాలయ్య, మహేశ్, యాసి న్, విమల, కృష్ణకుమారి,లత, మాధవి, స్వప్న, రేణుక పాల్గొన్నారు.