న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ను తన రెండో హబ్గా తీర్చిదిద్దనున్నట్లు వరల్డ్ లాజిస్టిక్ పాస్పోర్ట్ (డబ్ల్యూఎల్పీ) ప్రకటించింది. ఇప్పటికే దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబైలో డబ్ల్యూఎల్పీ సేవలందిస్తున్నది. భారతదేశంలో తన సేవలను విస్తరించనున్నట్లు తెలిపింది. ఇందుకోసం హైదరాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ పరిధిలో జీఎంఆర్ అనుబంధ రెండు సంస్థలతో భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకుంది.
అంతర్జాతీయంగా వస్తువులు, సేవలను ఎగుమతి చేయడానికి వ్యూహాత్మకంగా హైదరాబాద్ ముఖ్యమైందని డబ్ల్యూఎల్పీ తెలిపింది. దీనివల్ల 2100 కోట్ల డాలర్ల మేరకు బిజినెస్ జరుగుతుందని అంచనా వేసింది. ఇంతకుముందు గత ఫిబ్రవరిలో ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, నవ షెవా ఇంటర్నేషనల్ కంటైనర్ టర్మినల్, ఎమిరేట్స్ స్కై కార్గో సంస్థలతో భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకున్నది.
డబ్ల్యూఎల్పీ సేవలందిస్తున్న దేశాల్లో భారత్ ఒకటిగా ఉందని ఆ సంస్థ సీఈవో మైక్ భాస్కరన్ తెలిపారు. ఇప్పటివరకు 10 దేశాలకు పైగా సేవలందిస్తున్నది. బ్రెజిల్, ఇండోనేషియా, దక్షిణాఫ్రికా తదితర దేశాల్లో డబ్ల్యూఎల్పీ పని చేస్తున్నది.
యూపీఎస్, ఫైజర్, సోనీ, జాన్సన్ అండ్ జాన్సన్, ఎల్జీ వంటి ప్రధాన బహుళ జాతి సంస్థలతో (ఎంఎన్సీ) టై అప్ అయింది. ఆఫ్రికా, ఆసియా, సెంట్రల్ అండ్ సౌత్ అమెరికా ల పరిధిలో వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నది.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
బ్లడ్ క్యాన్సర్.. లక్షణాలు ఎలా ఉంటాయి.. చికిత్స ఏంటి..?
సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి సేంద్రియ వ్యవసాయం