అమీన్పూర్, మార్చి 30 : మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి అధ్యక్షతన మంగళవారం అమీన్పూర్ మున్సిపల్ బడ్జెట్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 2020-2021 ఆర్థిక సంవత్సరానికి గాను సాధారణ వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇందులో పురపాలక వార్షిక సాధారణ అంచనా బడ్జెట్ మొత్తం రూ. 3937.76 లక్షలకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. అందు లో పన్ను రాబడి రూ.1029.67 లక్షలు, పన్నేతర రాబడి ఆదా యం రూ.1197 లక్షలు, 2020 -2021 ఆర్థిక సంవత్సరం మిగులు రూ.1710.89 లక్షలు అంచనా వేశారు. వివిధ వార్డుల అభివృద్ధి పనుల కోసం రూ. 929.00 లక్షల మూలధన వ్య యాలకు కేటాయింపులు చేశారు. బడ్టెట్ అంచనాలపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మున్సిపల్ పత్యేకాధికారి, అడిషనల్ కలెక్టర్ రాజర్షి షా, మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి, కమిషనర్ సుజాత సమాధానం ఇచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరానికి తయారు చేసిన బడ్జెట్పై ఏకగ్రీవ తీర్మానం చేసి ఆమోదం పొందినట్లు కమిషనర్ సుజాత పేర్కొన్నారు. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నందారం నర్సింహాగౌడ్, కౌన్సిలర్లు బాశెట్టి కృష్ణ, బీజీలి రాజు, కొల్లూరి మల్లేశ్, కవితా శ్రీనివాస్రెడ్డి, కల్పనాఉపేందర్రెడ్డి, మహదేవరెడ్డి, చదువు మల్లేశ్, సుధారాణి, మంజుల ప్రమోద్రెడ్డి, నవనీత జగదీశ్, ఎండ్ల రమేశ్, సంధ్య, బాలరాజ్ బాలమణి, చంద్రకళ, మాధురి, రాజేశ్వరి, కవిత, యూసుఫ్ అలీ, అనిరుధ్రెడ్డి, జాహంగీర్, కో-ఆప్షన్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.
ఆదాయ, వ్యయాల ఆధారంగానే బడ్జెట్..
ఇవీ కూడా చదవండి..
కరోనా ఎఫెక్ట్ : యాదాద్రిలో ఆర్జిత సేవల నిలిపివేత
మౌనం ఎందుకు పాటిస్తారు? ఆ కాన్సెప్ట్కు కారణమేంటి?