హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): రూ.1.82 కోట్ల ఎల్ఐసీ నిధులను గోల్మాల్ చేసిన సంస్థ మాజీ ఉద్యోగి ధరావత్ సక్రుపై ఈడీ అధికారులు మంగళవారం విశాఖపట్నం ప్రత్యేక న్యా యస్థానంలో అభియోగపత్రాలు నమోదుచేశారు. 2014లో ఏపీ పోలీసులు రూ.1.05 కోట్ల ఎల్ఐసీ నిధుల గోల్మాల్పై ఆ సంస్థ హైయర్ గ్రేడ్ అసిస్టెంట్గా పనిచేసిన సక్రుపై నమోదుచేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. రూ. 1.05 కోట్లతోపాటు మరో 77 లక్షలు మోసగించినట్టు గుర్తించారు.
ఇవీ కూడా చదవండి
సూయజ్ బ్లాకేడ్: 54 బిలియన్ల డాలర్ల నష్టం!
రూ.246.25 కోట్ల బడ్జెట్కు ఆమోదం