పుదుచ్చేరి : కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో డ్రోన్లపై, యూఏవీలపై నిఘా విభాగం నిషేధం విధించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ప్రధాని రానున్న సందర్భంగా 144 సెక్షన్ను అమలు చేస్తున్నారు. ఎవరైనా ఉల్లంఘనలు అతిక్రమిస్తే.. సెక్షన్ 188 కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎన్డీఏ అభ్యర్థులు పోటీ చేస్తే స్థానాల్లో మోదీ ఎన్నికల ప్రచారం చేయనున్నారు. పుదుచ్చేరిలో ఏప్రిల్ 6న ఎన్నికలు జరగనున్నాయి.
ఇవి కూడా చదవండి..