పర్యాటక రంగ అభివృద్ధికి తోడ్పాటు
చీఫ్ విప్ వినయ్భాస్కర్ ప్రయత్నం
మంత్రి కేటీఆర్కు ప్రత్యేకంగా విజ్ఞప్తి
హైదరాబాద్ తరహా కేటాయించాలని లేఖ
వరంగల్, మార్చి 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): చారి త్రక వరంగల్ నగరానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన పర్యాటక రంగ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో తోడ్పాటు నందిస్తున్నది. ఈ రంగానికి మరింత ఊతమిచ్చేలా ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్భాస్కర్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. హైదరాబాద్ తరహా వరంగల్ నగరానికి డబుల్ డెక్కర్ బస్సు సర్వీసును మంజూరు చేయాలని మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్కు విజ్ఞప్తి చేస్తూ లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లో డబుల్ డెక్కర్ బస్సులను మళ్లీ ప్రారంభిం చేందుకు ఏర్పాట్లు చేస్తున్న తరుణంలో వరంగల్కు కూడా ఈ సౌకర్యం కల్పించాలని కోరారు. ‘తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ నగరం సమగ్రాభివృద్ధి చెందుతున్నది. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత రెండో అతి పెద్ద నగరంగా వరంగల్కు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో మీ మార్గదర్శనంలో వరంగల్ వేగంగా అభివృద్ధి చెందింది.
చారి త్రక నగరం పర్యాటకంగా, సాంస్కృతిక కేంద్రంగా ప్రసిద్ధి గాంచింది. అగ్గలయ్యగుట్ట, వెయ్యి స్తంభాల గుడి, ఖిలా వరంగల్, భద్రకాళీ ఆలయం, పద్మాక్షి ఆలయం, కాజీపేట దర్గా, ఫాతిమా చర్చి వంటి పర్యాటక ప్రాంతాలు వరంగ ల్లో ఉన్నాయి. కాకతీయుల నాటి ఎన్నో చారిత్రక కేంద్రాలు టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధితోనే వెలు గులోకి వచ్చాయి. భద్రకాళీ బండ్ నిర్మాణంతో వరంగల్కు కొత్తకళ వచ్చింది. చారిత్రక, సాంస్కృతిక, పర్యాటక రంగాల్లో ముందున్న వరంగల్ నగరానికి మరింత గుర్తింపు తెచ్చేం దుకు వీలుగా మీ సహకారం కావాలని కోరుతున్నాం. హైద రాబాద్ తరహాలోనే వరంగల్కు డబుల్ డెక్కర్ బస్సు కేటా యించాలని విజ్ఞప్తి చేస్తున్నాం’ అని చీఫ్విప్ వినయ్భాస్కర్ లేఖలో పేర్కొన్నారు.