బీజింగ్, మార్చి 29: ప్రపంచానికి పెను ముప్పుగా పరిణమించిన కరోనా వైరస్ మొదట గబ్బిలాల నుంచే మనుషులకు సోకి ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో), చైనా శాస్త్రవేత్తలు సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో అభిప్రాయపడ్డారు. 2019 డిసెంబర్-2020 జనవరి మధ్యకాలంలో చైనాలోని వుహాన్లో సార్స్ కోవ్-2 వైరస్ను మనుషుల్లో గుర్తించిన విషయం తెలిసిందే. వుహాన్లోని వైరాలజీ ల్యాబ్నుంచే వైరస్ లీక్ అయిందని అమెరికా మొదటినుంచీ ఆరోపిస్తున్నది.
నివేదికపై అమెరికా విమర్శలు
వైరస్ ల్యాబ్నుంచి లీక్ అయిందనే వాదనను శాస్త్రవేత్తలు తిరస్కరించారు. అనేకసార్లు వాయిదా పడిన తర్వాత సోమవారం ఈ అధ్యయన నివేదికను అనధికారికంగా విడుదలచేశారు. అయితే, దీనిపై స్పందించేందుకు డబ్ల్యూహెచ్వో నిరాకరించింది. ఈ రిపోర్టు విడుదల కాకముందే అమెరికా దానిని తిరస్కరించింది. రిపోర్టును చైనా తన పలుకుబడితో మార్చే ప్రయత్నం చేస్తున్నదని అమెరికా విదేశాంగమంత్రి ఆంటోని బ్లింకెన్ ఇటీవల విమర్శించారు. బ్లింకెన్ విమర్శలను చైనా సోమవారం తిప్పికొట్టింది. అమెరికానే డబ్ల్యూహెచ్వో సభ్యదేశాలపై ఒత్తిడి తెచ్చి ఈ రిపోర్టును మార్చే ప్రయత్నం చేసిందని ఎందుకు అనుమానించకూడదని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి ఝావో లిజియాన్ ప్రశ్నించారు.
మనుషులకు వైరస్ నాలుగు విధాలుగా సోకి ఉండవచ్చని అధ్యయన బృందం అంచనా
గబ్బిలాల్లో ఉండే ఈ వైరస్ పంగోలిన్ అనే మరో జంతువు ద్వారా మనుషులకు సోకింది అనటానికే ఎక్కువ అవకాశం ఉన్నది.
గబ్బిలాల నుంచే నేరుగా మనుషులకు సోకి ఉండవచ్చు
శీతల గిడ్డంగుల్లో నిల్వ ఉంచిన మాంసాహార ఉత్పత్తుల నుంచి కూడా ఈ వైరస్ మనుషులకు వ్యాపించి ఉండవచ్చు
మింక్లు (ముంగిస జాతి జంతువు), పిల్లుల నుంచి కూడా కరోనా మనుషులకు సోకి ఉండే అవకాశం ఉన్నది.
ఇవీ కూడా చదవండి..
నీలిచిత్రాలు చూసేందుకు యత్నం.. వర్సిటీ సిబ్బంది తొలగింపు
ఇలాగైతే లాక్డౌన్ తప్పదు : మహారాష్ట్ర డిప్యూటీ సీఎం
ప్రధాని గడ్డం మాత్రమే పెరుగుతున్నది: మమతాబెనర్జి