చెన్నై: తమిళనాడు రాష్ట్రం దిండిగుల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మిల్లులో పనిచేసే ఉద్యోగులతో వెళ్తున్న వ్యాను, ప్రయాణికులతో వస్తున్న ప్రభుత్వ బస్సు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 62 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. దాంతో వారిని మెరుగైన చికిత్స కోసం మధురై రాజాజీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
కాగా, దిండిగుల్ జిల్లాలోని వతలకుందు ఏరియాలో ఈ ప్రమాదం జరిగిందని, మృతి చెందిన నలుగురిలో వ్యాన్ డ్రైవర్ కూడా ఉన్నాడని పోలీసులు తెలిపారు. స్వల్పంగా గాయపడ్డ 54 మందికి స్థానిక ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారని, తీవ్రంగా గాయపడిన 8 మందిని మధురై రాజాజీ గవర్నమెంట్ ఆస్పత్రికి తరలించామని వారు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు చెప్పారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
తుపాకీతో కాల్చుకుని కార్పొరేటర్ కుమారుడు ఆత్మహత్య
మున్సిపల్ ఆఫీస్పై ఉగ్రవాదుల కాల్పులు.. గన్మ్యాన్, కౌన్సిలర్ దుర్మరణం
ఆ వృద్ధురాలు మృతి.. బీజేపీ, టీఎంసీ మధ్య మళ్లీ మాటల యుద్ధం
ఊరంతా కప్పేసిన మంచు దుప్పటి..!
గడ్చిరోలిలో భారీ ఎన్కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు మృతి..!
అలస్కాలో కుప్పకూలిన హెలికాప్టర్..
లండన్లో ప్రియాంక చోప్రా హోలీ సంబురాలు
చిన్నారి పెళ్లికూతురు పెళ్లి పీటలెక్కిందా?