సికింద్రాబాద్ : నిరుద్యోగ యువతీ యువకుల కోసం సీతాఫల్మండిలోని మల్టీపర్పస్ ఫంక్షన్హాల్లో ఏప్రిల్ 7న మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ తెలిపారు. సెట్విన్ సంస్థ ఆధ్వర్యంలో 30 ప్రధాన ప్రైవేట్ రంగ సంస్థలు భాగస్వామ్యం అయ్యే ఈ జాబ్ మేళాలో కనీసం రెండువేల మందికి పైగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను కల్పించేలా ఏర్పాటు చేశామన్నారు. శనివారం సెట్విన్ మేనేజింగ్ డైరెక్టర్ వేణుగోపాల్, ఇతర అధికారులు, కార్పొరేటర్లు జాబ్మేళా కరపత్రాన్ని సీతాఫమండిలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ ఈ జాబ్మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
మేడ్చల్ లో నిరుద్యోగ యువకులకు మేడ్చల్ జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈనెల 30న ఆన్లైన్ ద్వారా జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు మేడ్చల్ జిల్లా ఉపాధి కార్యాలయ అధికారి నిర్మల తెలిపారు. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్, (క్వెస్ కార్పొరేషన్ లిమిటెడ్) కంపెనీల్లో వంద పోస్టులకు ఇంటర్మీడియట్, ఐటీఐలో ఉత్తీర్ణత పొందిన వారు జేఎఫ్ఎ-జేఐవో ఫైబర్ అసోసియేట్ ఉద్యోగులు అర్హులు అని పేర్కొన్నారు. బయోడేటాను 8247656 356 నంబర్కు పంపించాలని కోరా రు.ఆన్లైన్లో వెబ్సెట్ WWW. NCS.GOV.INలో దరఖాస్తు చేసుకోవాలని అధికారి నిర్మల సూచించారు. ఈనెల 30న ఉదయం 11:30 గంటలకు ఆన్లైన్లో జాబ్మేళా ప్రారంభమవుతుందన్నారు