అమరావతి : విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీలో కరోనా కలకలం సృష్టించింది. ఇంజినీరింగ్ క్యాంపస్లో ఒకే రోజు 58 మంది విద్యార్థులు పాజిటివ్గా పరీక్షించారు. క్యాంపస్లో మొత్తం 800 మంది విద్యార్థులకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. కేసులు బయటపడ్డాయి. మరో 400 మంది విద్యార్థులకు సంబంధించి ఫలితాలు రావాల్సి ఉంది. అయితే, కేసులు మరింత పెరిగే అవకాశం ఉందని జిల్లా వైద్యా ఆరోగ్యశాఖ యంత్రాంగం పేర్కొంది.
హాస్టల్ను విద్యార్థులను ఐసోలేషన్లో ఉంచారు. బ్లాక్-1, బ్లాక్-2-, బ్లాక్-3లో మరికొంత మంది విద్యార్థులకు వైద్యసేవలందిస్తున్నారు. కరోనా కేసుల నమోదుతో ఆ ప్రాంతాన్ని కంటైన్జోన్గా ప్రకటించారు. అప్రమత్తమైన అధికారులు యూనివర్సిటీలు అధికారులు శానిటేషన్ చేపట్టారు. అయితే విజయవాడ నుంచి వచ్చిన ఓ విద్యార్థి మొదట వైరస్ పాజిటివ్గా పరీక్షించాడు. అతని ద్వారా మిగతా వారికి వ్యాపించి ఉంటుందని గుర్తించినట్లు తెలుస్తోంది.
ఇంజినీరింగ్ కళాశాలలో డే స్కాలర్తో కలిపి 5వేల వరకు ఉంటారని యూనివర్సిటీ అధికార వర్గాలు తెలిపాయి. హాస్టల్లో 800 మంది విద్యార్థులుండగా వారందరికీ టెస్టులు చేసినట్లు పేర్కొన్నారు. ఎవరికీ లక్షణాలు కనిపించలేదని తెలిపారు. వైరస్ ఇతరులకు సోకకుండా కంటైన్జోన్ ప్రకటించి, బ్లాక్ ఖాళీ చేయించినట్లు చెప్పారు. హాస్టల్ గదులను క్వారంటైన్, ఐసోలేషన్కు వినియోగిస్తున్నట్లు చెప్పారు. భయపడాల్సిన అవసరం ఏమీ లేదని, అన్ని వైద్యసేవలందిస్తున్నట్లు పేర్కొన్నారు.త్వరలోనే మహిళా హాస్టల్లో పరీక్షలు చేయించాల్సి ఉంటుందన్నారు.
ఇదిలా ఉండగా.. ఏప్రిల్ 6వ తేదీ వరకు ఇంజినీరింగ్ పరీక్షలు జరుగాల్సి ఉంది. పరీక్షల కోసమే విద్యార్థులు హాస్టల్కు వచ్చారు. విద్యార్థులు వైరస్ బారినపడడంతో యూనివర్సిటీ కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం జరగాల్సిన పరీక్షలన్ని వాయిదా వేసింది. మళ్లీ ఎప్పుడు పరీక్షలు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తామని పేర్కొంది. ఇకపై అన్ని తరగతులకు ఆన్లైన్ బోధన చేపట్టాలని ఆదేశించింది.