గ్రామీణ ప్రాంతాల్లో గంజాయి దందా
హైదరాబాద్ నుంచి సరఫరా
విక్రయాలపై కొరవడిన ఎక్సైజ్, పోలీస్శాఖల నిఘా
విచ్చలవిడిగా వినియోగం
నిఘా లేకపోతే మరింత ప్రమాదం
యాదగిరిగుట్ట రూరల్, మార్చి 26: గ్రామీణ ప్రాంతా ల్లో గంజాయి సరఫరా విచ్చలవిడిగా కొనసాగుతున్న ది. గంజాయి మత్తులో యువత జీవితాలను నాశనం చేసుకునే పరిస్థితి వస్తున్నది. గ్రామాల్లో యువత గం జాయి మత్తులోకి దిగుతుండగా విక్రయాలపై నిఘా పూర్తిగా కొరవడింది. మత్తు పదార్థాల సరఫరా, తయారీపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించి నా ఎక్సైజ్, పోలీస్శాఖల నిఘా లేక యథేచ్ఛగా దందా కొనసాగుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
హైదరాబాద్ నుంచే సరఫరా
హైదరాబాద్ నుంచి ప్రధానంగా యాదగిరిగుట్ట మం డలానికి గంజాయి సరఫరా అవుతున్నట్లు సమాచా రం. దీనికి రోడ్డు మార్గంతో పాటు రైలు మార్గాన్ని కూ డా ఎంచుకుంటున్నారు. కొంతమం ది వాహనాలపై వచ్చి గ్రామాల్లో యు వకులకు గంజాయి ఇచ్చి వెళ్తున్నట్లు తెలుస్తున్నది. ముఖ్యంగా యాదగిరిగుట్ట పట్టణంలోని కొన్ని ప్రాంతాలు, గౌరాయపల్లి, వంగపల్లి, మహబూబ్పేట, చొల్లేరు గ్రామాల్లోని యువతను టార్గెట్గా చేసుకొని విక్రయాలు జరుపుతున్నట్లు తెలుస్తున్నది. 10,15,20,25 గ్రాములు మొదలుకొని 100 గ్రాము ల వరకు బరువు కలిగిన గంజాయి ప్యాకెట్లను విక్రయిస్తున్నారు. సిగరెట్లలో పొగాకు తొలగించి వాటిల్లో గం జాయి నింపి పీల్చుతున్నారు. ఈ గంజాయి ప్యాకెట్ ను అందులోని పరిమాణాన్ని బట్టి రూ. 300 నుంచి రూ. 800 వరకు కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం.
నిత్యం కొనసాగుతున్న విక్రయాలు
గ్రామీణ ప్రాంతాల్లో గంజాయి దందా నిత్యం కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తులు హైదరాబాద్ నుంచి తీసుకువచ్చి ఆయా గ్రా మాలకు రోడ్డు మార్గం ద్వారా సరఫరా చేస్తున్నట్లు తెలుస్తున్నది. ప్రధానంగా వి ద్యార్థులు, యువతనే లక్ష్యంగా చేసుకొ ని ఈ దందా కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే యాదగిరిగుట్ట పట్టణంలోని కొన్ని ప్రాంతాలు, మండలంలోని ఆయా గ్రామాల్లో యు వత గంజాయికి అలవా టు పడింది. ఈ ప్రమాదకరమైన గంజాయికి బానిసైతే దాని నుంచి కోలుకోవ డం చాలా కష్టం. దీనిపై ఎక్సైజ్, పోలీస్శాఖ అధికారు లు నిఘా పెంచాలని స్థానికులు కోరుతున్నారు.