హైదరాబాద్, మార్చి 22: ఇంటిగ్రేటెడ్ కంటైనర్ గ్లాస్ తయారీ సంస్థ ఏజీఐ గ్లాస్పాస్…జర్మనీకి చెందిన టెక్నాలజీ దిగ్గజం హార్న్-గ్లాస్ ఇండస్ట్రీస్తో కలిసి ప్రత్యేక యూనిట్ను నెలకొల్పింది. భువనగిరి వద్ద ఉన్న ప్లాంట్లోనే ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక యూనిట్ కోసం రూ.55 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ జర్మనీ టెక్నాలజీతో భారత్ బయట గ్లాస్ ప్యాకేజింగ్ ఉత్పత్తులకు ఊతమివ్వడానికి దోహదం చేయనున్నదని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.