లండన్: రాబోయే రాయల్ లండన్ కప్-2021 కోసం లంకషైర్ క్రికెట్ క్లబ్ టీమ్ఇండియా బ్యాట్స్మన్ శ్రేయస్ అయ్యర్తో ఒప్పందం చేసుకుంది. జూలై 15న అక్కడ అడుగుపెట్టనున్న అయ్యర్ నెల రోజుల పాటు జరిగే లీగ్ దశ మ్యాచ్లకు అతడు అందుబాటులో ఉంటాడు. భారత్ తరఫున 21 వన్డేలు, 29టీ20లకు ప్రాతినిధ్యం వహించిన శ్రేయస్ క్లబ్ తరఫున బరిలో దిగబోతున్న ఆరో ఇండియన్ క్రికెటర్గా నిలువనున్నాడు.
ఇప్పటికే భారత మాజీ క్రికెటర్లు ఫరూక్ ఇంజినీర్, వీవీఎస్ లక్ష్మణ్, సౌరభ్ గంగూలీ, దినేశ్ మోంగియా, మురళీ కార్తీక్ క్లబ్కు ప్రాతినిధ్యం వహించారు. 50 ఓవర్ల టోర్నమెంట్లో భాగంగా లంకషైర్ సొంతగడ్డపై జూలై 20న ససెక్స్తో మ్యాచ్తో టోర్నీని ఆరంభించనుంది.ఇంగ్లాండ్ వేదికగా టోర్నీ జరుగుతుంది.