అల్వాల్/గౌతంనగర్/వినాయక్నగర్, మార్చి 21 : రాష్ట్రంలో ఎన్నిక ఏదైనా గెలుపు టీఆర్ఎస్దేనని మచ్చబొల్లారం కార్పొరేటర్ రాజ్ జితేందర్నాథ్ అన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా సురభి వాణీదేవి విజయాన్ని పురస్కరించుకొని అల్వాల్ మచ్చబొల్లారం డివిజన్లో విజయోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలసి కేక్ను కట్చేసి.. సంబురాలు చేసుకున్నారు. అనంతరం టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సురభి వాణీదేవి విజయంతో రాష్ట్రంలో ఉన్న విద్యావంతులు, పట్టభద్రులు టీఆర్ఎస్ వైపే ఉన్నట్లు రుజువైందని ఆయన అన్నారు. పోరాడి సాధించుకున్న రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్కు ప్రతిఒక్కరూ అండగా నిలిచి రాష్ట్ర అభివృద్ధికి తమవంతు సహకారాన్ని అందించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
గౌతంనగర్ చౌరస్తాలో సంబురాలు
ప్రభుత్వంపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించినందుకు ఆదివారం సాయినగర్ చౌరస్తాలో కార్పొరేటర్ మేకల సునీతారాముయాదవ్ ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సంక్షేమం సాధ్యమని పట్టభద్రులకు నమ్మకం ఉందని అన్నారు. అన్ని వర్గాల ప్రజలను ఆదుకునేది సీఎం కేసీఆర్ అని అందుకే టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు విజయం సాధించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, టీఆర్ఎస్ నాయకులు గజ్జెల నాగేశ్, మాజీ కార్పొరేటర్ జగదీశ్గౌడ్, మేకల రాముయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధికే పట్టం కట్టారు
టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివద్ధికి పట్టభద్రులు పట్టం కట్టారని టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వీకే మహేశ్ అన్నారు. ఆదివారం ఉదయం టీఆర్ఎస్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిచిన వాణీదేవిని వీకే మహేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పట్టభద్రుల అభివృద్ధి కోసం చేస్తున్న కృషిని గుర్తించి ఓటు వేశారన్నారు. కార్యక్రమంలో జనార్దన్, ధనుంజయ్, వెంకటేశ్, సుదర్శన్గౌడ్, తదితరులు పాల్గొన్నారు.