సిద్దిపేట ప్రభుత్వ దవాఖానలో సీటీస్కాన్ సేవలు ప్రారంభం
ఐసీయూ, డయాలిసిస్ సెంటర్లో పడకల సామర్థ్యం పెంపు
ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు
సిద్దిపేట జోన్, మార్చి 21 : నయా పైసా ఖర్చు లేకుండా నిరుపేదలకు కార్పొరేట్ దవాఖానలకు దీటుగా సిద్దిపేట ప్రభుత్వ వైద్యశాలతో పాటు జిల్లాలోని 34 ప్రభుత్వ ఆరోగ్య కేం ద్రాల్లో అన్నిరకాల వైద్యపరీక్షలు అందుబాటులోకి తెచ్చామని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు తెలిపా రు. పేదలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఆదివారం రూ.2. 15 కోట్లతో సీటీస్కాన్, రూ.2.40కోట్లతో ఐసీ యూ, రూ.40లక్షలతో ఏర్పాటు చేసిన లిఫ్ట్ సౌక ర్యం, రూ.50లక్షలతో ఏర్పాటు చేసిన అటెండెంట్ వెయిటింగ్ హాల్ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. పేదలకు ఖరీదైన వ్యాధి నిర్ధ్దారణ పరీక్షలు ఉచితంగా అందుబాటులోకి తెచ్చామన్నారు.
సీటీ స్కాన్ సేవలు అందుబాటులోకి రాకముందు ప్రతిరోజు ప్రభుత్వ దవాఖాన నుంచి కనీసం 10 మంది రోగులను ప్రైవేట్ దవాఖానలకు రెఫర్ చేసేవారన్నారు. తలనొప్పి, యాక్సిడెంట్, సీటీ అబ్డోమెన్, సిటీ బ్రెయిన్, సీటీ చెస్ట్ పరీక్షలు ఈ సీటీ స్కాన్ సెంటర్ ద్వారా ప్రజలకు ఉచితంగా 24గంటలు టెస్టులు చేస్తారని మంత్రి తెలిపారు. ఈ దవాఖానలో 10పడకల ఐసీయూ బెడ్స్ ఉండేవని, మరో 20పడకలను నేడు ప్రారంభించుకున్నట్లు తెలిపారు. మొత్తం 30బెడ్లు అందుబాటులోకి వచ్చాయన్నారు. నాలుగేండ్లుగా ఉచిత భోజన సౌకర్యం కల్పిస్తున్నామని, ప్రస్తుతం రోగితో పాటు సహాయకుడికి కూడా మధ్యాహ్నం, రాత్రి ఉచిత భోజన సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 20వేల మందికి సంబంధించి 90,978 పరీక్షలు చేశామన్నారు. కిడ్నీ భాధితుల సౌకర్యార్థం ప్రభుత్వ జనరల్ దవాఖానలో డయాలసిస్ యూనిట్ను 10పడకల సామర్థ్యాన్ని పది రోజుల్లో 13పడకలకు పెంచుతామని మంత్రి తెలిపారు. ఈ దవాఖానలో రూట్ కెనాల్కు ట్రీట్మెంట్ సౌకర్యం ఉందని, దంత సమస్యలతో బాధపడుతున్న వారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కరోనాపై అప్రమత్తంగా ఉండాలి..
దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయని, ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని మంత్రి హరీశ్రావు సూచించారు. మాస్కులు ధరించడం, శానిటైజర్ అందుబాటులో ఉంచుకోవడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరిగా పాటించాలన్నారు. 45ఏండ్లు పైబడి బీపీ, షుగర్ తదితర దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారికి ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సినేషన్ వేస్తుందన్నారు.
జర్నలిస్టులకు కొవిడ్ వ్యాక్సినేషన్..
తమకు వ్యాక్సిన్ వేయాలని పాత్రికేయులు ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావుకు విజ్ఞప్తి చేశారు. దీనిపై వెంటనే మంత్రి స్పందించారు. ప్రభుత్వ గుర్తింపుకార్డు కలిగిన పాత్రికేయులకు సిద్దిపేట ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో సోమవారం ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12వరకు కొవిడ్ మొదటి దశ వ్యాక్సినేషన్ చేపట్టాలని వైద్యాధికారులకు సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ పాల సాయిరాం, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ తమిళ అరుసు, సూపరింటెండెంట్ డాక్టర్ జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.