కడ్తాల్, మార్చి 19 : చరికొండ గ్రామంలో వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఆలయంలో రుక్మిణీసత్యభామ సమేత వేణుగోపాలస్వామి కల్యాణం కనుల పండువగా చేశారు. ఈ సందర్భంగా ఆలయాన్ని శోభాయమానంగా అలంకరించారు. స్వామి వారి పట్టు వస్ర్తాలు, తలంబ్రాలను ప్రధాన వీధులగుండా ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం వేద పండితులు చక్రవర్తి శ్రీనివాసాచార్యులు, రామానుజాచార్యులు, కృష్ణామాచార్యులు, కిరణాచార్యులు, వేణుగోపాలచార్యుల వేద మంత్రోచ్ఛరణలతో కల్యాణం జరిపించారు. ప్రజాప్రతినిధు లు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కల్యాణా న్ని తిలకించారు. అనంతరం స్వామి వారి తీర్థప్రసాదాలను భక్తులకు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ భారతమ్మ, ఎంపీటీసీ రాములుగౌడ్, ఉప సర్పంచ్ నరేశ్, నాయకులు నర్సింహాగౌడ్, లక్ష్మయ్యగౌడ్, యాదమ్మ, భీష్మాచారి, జంగయ్యగౌడ్, సత్యశీలారెడ్డి పాల్గొన్నారు.