కరోనాతో ప్రపంచం వణికిపోయిన పరిస్థితుల్లోనూ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి దెబ్బతగలకుండా చర్యలు తీసుకుంటూ, అన్ని వర్గాలకు మేలు చేసేలా బడ్జెట్ను రూపకల్పన చేయడం ముఖ్యమంత్రి కేసీఆర్ సమర్థతకు, పాలనాదక్షతకు నిదర్శనం. భవిష్యత్తులో ఏ సంక్షోభం వచ్చినా తెలంగాణకు ఢోకా లేదని కేసీఆర్ నిరూపించారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి, కులవృత్తులు, ఉద్యోగ వర్గాలన్నింటినీ సంతృప్తి పరిచేలా బడ్జెట్లో నిధులు కేటాయించారు. తెలంగాణలో పుట్టినందుకు గర్వపడేలా చేశారు.
– వీ శ్రీనివాస్గౌడ్, ఎక్సైజ్శాఖ మంత్రి
రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే లక్ష్యంగా బడ్జెట్ రూపకల్పన చేశారు. లాక్డౌన్తో ఆర్థిక వ్యవస్థ మందగించినా.. సంక్షే మం, మౌలికరంగాలకు బడ్జెట్లో పెద్దపీట వేశారు. షెడ్యూల్డ్ కులాల్లో వెలుగులు నింపేలా కేటాయింపులు చేశారు. అటవీ, దేవాదాయ, న్యాయశాఖలకు బడ్జెట్లో అధిక కేటాయింపులు చేసినందునకు ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు.
– అల్లోల ఇంద్రక్రణ్రెడ్డి, దేవాదాయశాఖ మంత్రి
ఇది ప్రజా సంక్షేమ బడ్జెట్. అన్నివర్గ్గాలకు ప్రాధాన్యమిస్తూ రూపొందించిన బడ్జెట్ జనరంజకంగా ఉన్నది. దళిత ఎంపవర్మెంట్ పథకంతో ఆయావర్గాలకు ఎంతో ప్రయోజనం కలుగనున్నది. విద్యారంగానికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించడంతో ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించుకునే అవకాశం లభించింది. ప్రధానంగా ఆర్టీసీ రూ.3 వేల కోట్లు కేటాయించడం చరిత్రాత్మకం. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ సంస్థ, కార్మికులపై వాత్సల్యాన్ని చాటుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేక దన్యవాదాలు.
– పువ్వాడ అజయ్కుమార్, రవాణాశాఖ మంత్రి
టీఆర్ఎస్ ప్రభుత్వం జన రంజక బడ్జెట్ను ప్రవేశపెట్టిం ది. అన్ని వర్గాలకు మరింత మేలు చేసేలా బడ్జెట్ ఉన్నది. గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలంగాణ కార్మికులను సానుభూతితో ఆదుకోవాలని ప్రభుత్వం నిర్ణయించడం హర్షణీయం. రానున్న రోజుల్లో గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. బడ్జెట్ సకల జనుల సంక్షేమం, దళితుల సాధికారత, ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించింది. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్రావుకు ధన్యవాదాలు.
– మహేశ్ బిగాల, టీఆర్ఎస్ ఎన్నారై విభాగం కోఆర్డినేటర్
గతంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి ఇంత పెద్ద మొత్తంలో నిధులు కేటాయించలేదు. ఒకే బడ్జెట్లో రూ.1,500 కోట్లు ప్రతిపాదించడం, మరో రూ. 1,500 కోట్లు బడ్జెట్యేతర కేటాయింపులు జరపడం ఆర్టీసీ చరిత్రలో మొదటిసారి. కరోనా విపత్కర సమయంలో ఆర్టీసీ చాలా నష్టాలను చవిచూసింది. పెద్ద మొత్తంలో నిధులు కేటాయించి సీఎం కేసీఆర్ సార్ మరోసారి ఆర్టీసీ కార్మికుల పక్షపాతి అని నిరూపించుకున్నారు. సీఎం కేసీఆర్తోపాటు మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, అజయ్, ఎమ్మెల్సీ కవితకు ప్రత్యేక ధన్యవాదాలు.
– ఎం థామస్రెడ్డి,టీఎంయూ రాష్ట్ర నాయకుడు
రాష్ట్ర బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలకు, అన్నిరంగాలకు లబ్ధిచేకూరేలా ఉన్నది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సాగునీటి రంగానికి ప్రాధాన్యమిస్తూ కొత్త సాగునీటి లిఫ్ట్లకు బడ్జెట్లో కేటాయింపులు చేయడం సంతోషకరం. సీఎం కేసీఆర్ వ్యవసాయం, దాని అనుబంధరంగాల్లో భారీ కేటాయింపులు చేసి రైతులపై ప్రేమను మరోసారి చాటుకున్నారు. కేసీఆర్కు జిల్లా ప్రజల తరపున ప్రత్యేక
ధన్యవాదాలు.
– వేముల ప్రశాంత్రెడ్డి, శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి
ఇది ప్రగతిశీల బడ్జెట్. గత బడ్జెట్ కంటే ప్రస్తుతం కేటాయింపులు అధికంగా ఉన్నా యి. గిరిజనుల, మహిళల సమగ్ర వికాసానికి తోడ్పడే బడ్జెట్ ఇది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కు రూ.250 కోట్ల అభివృద్ధి నిధులు కేటాయించినందుకు సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు.
– సత్యవతి రాథోడ్, మహిళా, శిశుసంక్షేమశాఖ మంత్రి
సబ్బండ వర్గాల సంక్షేమ, అభివృద్ధి సమాహారంగా రాష్ట్ర బడ్జెట్ ఉన్నది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అద్దం పడుతూ సకల జనుల సంక్షేమం, అభివృద్ధిని వీడకుండా బడ్జెట్ను రూపొందించారు. మిషన్ భగీరథకు నిధులు కేటాయించినందుకు సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు. వరంగల్ కార్పొరేషన్ రూ.250 కోట్లు కేటాయించడం సంతోషం. సంక్షేమ ప్రణాళికలు సమర్థంగా అమలుచేసేలా వార్షిక ఆర్థిక ప్రణాళిక రూపొందించిన మంత్రి హరీశ్రావు, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావుకు
అభినందనలు.
– ఎర్రబెల్లి దయాకర్రావు, పంచాయతీరాజ్ , గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి
ప్రజా సంక్షేమ బడ్జెట్ ఇది. కరోనా, లాక్డౌన్ల కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం పడినప్పటికీ, ప్రజా సంక్షేమం, వ్యవసాయం, సాగునీరు, విద్య, వైద్యం, మౌలిక వసతుల రంగాలతోపాటు హోంశాఖకు బడ్జెట్లో పెద్దపీట వేశారు. దళిత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్, వ్యవసాయ యాంత్రీకరణకు నిధులు కేటాయించడం హర్షణీయం. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు.
– మహమూద్ అలీ, హోంమంత్రి
అన్ని వర్గాలను సంతృప్తిపరిచేలా బడ్జెట్ ప్రతిపాదించడం అభినందనీయం. కరోనా కష్టకాలంలోనూ నిధుల కేటాయింపు చాలా అద్భుతంగా ఉన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కారు ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం. బడ్జెట్ అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతూ ప్రజా, ఉద్యోగ సంక్షేమాన్ని కోరుకుంటున్నది.
– కారం రవీందర్రెడ్డి, టీఎన్జీవో రాష్ట్ర మాజీ అధ్యక్షుడు
ఇది రైతు ప్రభుత్వం. దేశంలో వ్యవసాయరంగానికి అధిక బడ్జెట్ కేటాయిస్తున్న రాష్టం తెలంగాణ మాత్రమే. రైతుబంధు, రైతుబీమా పథకాలు కొనసాగిస్తూనే వ్యవసాయ యాంత్రీకరణకు రూ.1500 కోట్లు కేటాయించడం హర్షణీయం. రైతుల రుణమాఫీ కోసం రూ.5,225 కోట్లు కేటాయించారు. రైతుబీమా కోసం రూ.1200 కోట్లు, రైతుబంధు కోసం రూ.14,800 కోట్లు కేటాయించడం సంతోషకరం.
– సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి
ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతకు ఈ బడ్జెట్ నిరదర్శనం. ఉపాధికల్పన, వ్యవసాయం, సంక్షేమరంగాల అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇచ్చిన బడ్జెట్ ఇది. వైద్యం, విద్యరంగాలకు సముచిత ప్రాధాన్యం ఇస్తూ సమకూర్చిన బడ్జెట్. 50 శాతానికిపైగా నిధులు వ్యవసాయం దాని అనుబంధ రంగాల అభివృద్ధికి ఈ బడ్జెట్ శాశ్వత దారులు వేసింది. ఇతర రాష్ర్టాలకు, దేశం మొత్తానికి సంక్షేమం, శాశ్వత అభివృద్ధిని కలిపి ఎట్లా ముందుకు తీసుకెళ్లాలో సూచించే దిక్సూచి ఈ బడ్జెట్.
– జగదీశ్రెడ్డి, విద్యుత్తుశాఖ మంత్రి
ఇది దళిత సంక్షేమ బడ్జెట్. దళిత్ ఎంపవర్మెంట్ పథకానికి రూ.1000 కోట్లు, ఎస్సీల ప్రత్యేక ప్రగతి నిధి కోసం రూ.21,306.85 కోట్లు కేటాయించడం హర్షణీయం. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు అండగా టీఎస్ ప్రైడ్, దళిత బాలికల కోసం ఎల్బీనగర్లో న్యాయకళాశాల ఏర్పాటు చేసినందుకు, బడ్జెట్లో నిధులు కేటాయించినందుకు సీఎం కేసీఆర్, ఆర్థికమంత్రి హరీశ్రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు.
– మందుల సామేల్, తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్
దేవాదాయశాఖకు గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది బడ్జెట్లో రూ.720కోట్లు కేటాయించడం హర్షణీయం. ధూపదీప నైవేద్య పథకం జంటనగరాల దేవాలయాలకు విస్తరించడంవల్ల ఇక్కడి ఆలయాలు, అర్చకులకు మేలు జరుగుతుంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వేలాది ఆలయాల్లో ధూపదీప నైవేద్య పథకం అమలవుతున్నది. దేవాలయాల అభివృద్ధి, అర్చకుల సంక్షేమంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధపెట్టారు. సీఎం చంద్రశేఖర్రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు.
– సముద్రాల వేణుగోపాలాచారి, రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సభ్యుడు