సిటీబ్యూరో, మార్చి 16(నమస్తే తెలంగాణ): సైబర్ నేరగాళ్ల బారినపడి మోసపోతున్నవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది.. ప్రతి రోజూ 40 మంది వరకు బాధితులు ఫిర్యాదులు చేస్తుండగా.. అందులో 10 మందికి సంబంధించిన కేసుల్లో ఎఫ్ఐఆర్లు నమోదవుతున్నాయి.. మంగళవారం కూడా పలువురు బాధితులు హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.. ఈ మేరకు పోలీసులు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.