అమరావతి : తిరుపతి లోక్సభ ఉప ఎన్నికకు వైఎస్సార్సీపీ తమ అభ్యర్థిని ప్రకటించింది. డాక్టర్ గురుమూర్తిని ఉప ఎన్నిక బరిలో నిలుపనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. వైఎస్సార్సీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణంతో తిరుపతి లోక్సభ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 23న నోటిషికేషన్ విడుదల, ఏప్రిల్ 17న పోలింగ్, మే 2న ఫలితాలు వెల్లడించనున్నట్లు తెలిపింది. తిరుపతితోపాటు నాగార్జున సాగర్ ఉప ఎన్నిక సైతం ఏప్రిల్ 17నే జరగనుంది.