అహ్మదాబాద్: దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తుండటంతో గుజరాత్ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నది. ఆ రాష్ట్రంలోని మెట్రో నగరాలైన అహ్మదాబాద్, వడోదర, సూరత్, రాజ్కోట్లలో నైట్ కర్ఫ్యూ విధించాలని నిర్ణయించింది. రోజూ రాత్రి 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. మార్చి 17 నుంచి 31 వరకు ఈ కర్ఫ్యూ కొనసాగుతుందని తెలిపింది. నైట్ కర్ఫ్యూకు సన్నాహకంగా ఈ నాలుగు మెట్రో నగరాల్లో ఇవాళ అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం ఆరుగంటల వరకు ప్రీ-నైట్ కర్ఫ్యూ సిస్టమ్ అమలవుతుందని గుజరాత్ సర్కారు తన ఆదేశాల్లో పేర్కొన్నది.