న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: రైల్వే స్టేషన్ల ప్రాంగణంలో, రైలు ప్రయాణంలో ఇక తప్పనిసరిగా మాస్కు ధరించాలి. అంతేకాదు రైల్వే పరిసరాల్లో, రైళ్లలో ఎవరూ ఉమ్మి వేయకూడదు. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే నేరంగా పరిగణిస్తామని రైల్వే శాఖ ప్రకటించింది. దోషులకు రూ.500 వరకు జరిమానా విధిస్తామని తెలిపింది. ఈ మేరకు రైల్వే చట్టంలో మార్పు చేసింది. ఈ నిబంధన 6 నెలల పాటు అమలులో ఉంటుందని తెలిపింది. కాగా, క్రయోజెనిక్ ట్యాంకర్ల ద్వారా లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ను రవాణా చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. కరోనా కేసులు తీవ్రంగా ఉన్న మహారాష్ట్ర విజ్ఞప్తితో ఈ విషయంలో రైల్వే శాఖ ఒక విధానాన్ని రూపొందించింది.