హైదరాబాద్, : ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ నెల 16న ఎల్బీ స్టేడియంలో జాతీయ ఓపెన్ కరాటే చాంపియన్షిప్ను నిర్వహించనున్నారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ(సాట్స్) ఆధ్వర్యంలో టోర్నీని నిర్వహిస్తున్నట్లు రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ నిర్వాహకులు మాస్టర్ రవి, లక్ష్మి శుక్రవారం పేర్కొన్నారు. దాదాపు 1200 మంది క్రీడాకారులు ఈ చాంపియన్షిప్లో బరిలోకి దిగుతున్నారని వారు తెలిపారు. పురుషుల, మహిళల విభాగంలో విజేతలుగా నిలిచే వారికి ఎలక్ట్రిక్ స్కూటీలను అందజేయనున్నట్లు మీడియాకు వివరించారు. కార్యక్రమంలో అడిషనల్ డీజీ స్వాతి లక్రా, డీఐజీ సుమతి, సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.