హైదరాబాద్ : బంజారాహిల్స్లో నిర్మిస్తున్న బంజారా భవన్, ఆదివాసీ భవన్ ల నిర్మాణ పనులు ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు.
బంజారాలు, ఆదివాసీల ఆత్మగౌరవ ప్రతీకలుగా బంజారాహిల్స్లో ఒక్కొక్కటి రూ.20 కోట్ల చొప్పున మొత్తం రూ.40 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం అవుతున్న పనులను.. సీఎంవో కార్యదర్శి భూపాల్ రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తు, చీఫ్ ఇంజినీర్ శంకర్, ఇతర అధికారులతో కలిసి మంత్రి పనులను తనిఖీ చేశారు.
ఇప్పటికే దాదాపుగా భవనాల నిర్మాణం పూర్తి అయిందని అధికారులు వివరించారు. వచ్చే నెలలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులు మీదుగా ఈ భవనాలను ప్రారంభించుకునే విధంగా ఏ ఒక్క పని పెండింగ్ లేకుండా పనులు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇవి కూడా చదవండి..
మత్స్యగిరి దేవస్థానం అభివృద్ధికి కృషి : మంత్రి మల్లారెడ్డి
నిరాడంబరంగా ఉగాది వేడుకలు: మంత్రి అల్లోల
భద్రాద్రి రాములోరి కళ్యాణానికి రండి..