హైదరాబాద్ : కూకట్పల్లి పరిధిలోని సంగీత్ నగర్లో విషాదం నెలకొంది. పబ్జీ ఫైర్ గేమ్ ఆడుతూ.. 12 ఏండ్ల బాలుడు ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో మృతుడు మణికంఠ తల్లిదండ్రులతో పాటు బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆన్లైన్ క్లాసుల కోసం విద్యార్థికి తల్లిదండ్రులు ఫోన్ సమకూర్చగా, అతను పబ్జీ గేమ్లు ఆడుకుంటూ కాలక్షేపం చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. బాలుడి ఆత్మహత్యపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.