మహబూబ్నగర్ : కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నదని, అందులో భాగంగా పాలమూరులో బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసినట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పాత పాలమూరు దోబీ వాడలో నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, మున్సిపల్ చైర్మన్ కోరమోని నర్సింలు, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ తాటి గణేష్, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
అత్తను కర్రతో కొట్టి చంపిన అల్లుడు
ఈ పాస్ ఉంటేనే అనుమతి : డీఐజీ రంగనాధ్
ప్రజల ప్రాణాలు కాపాడటం మన బాధ్యత : మంత్రి నిరంజన్ రెడ్డి
రూ.22 కోట్ల ఫండ్ రేజ్ చేసిన ప్రియాంక-నిక్ దంపతులు