వరంగల్: కన్నతల్లి లాంటి టీఆర్ఎస్ పార్టీని ఎట్టిపరిస్థితిలో వీడేదిలేదని కమలాపూర్ మండలానికి చెందిన నాయకులు ప్రకటించారు. జెడ్పీటీసీ లాండిగ కళ్యాణి లక్ష్మణ్ రావు, మాజీ జెడ్పీటీసీ మారపెళ్లి నవీన్ కుమార్, టీఆరెస్ మండల పార్టీ అధ్యక్షుడు మాట్ల రమేష్ తదితరులు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని హన్మకొండలోని ఆయన నివాసంలో ఆదివారం ఉదయం కలిశారు. అనంతరం మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో పార్టీ సూచనల మేరకు పనిచేస్తామని, కమలాపూర్ మండలంలో టీఆర్ఎస్ను ఎదురులేని శక్తిగా తీర్చిదిద్దుతామని తేల్చిచెప్పారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు నాగుర్ల వెంకటేశ్వర్లు, వరంగల్ అర్బన్ జిల్లా పరిషత్ చైర్మన్ సుధీర్ బాబు తదితరులు పాల్గొన్నారు.